అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న, 30న మోడీ బహిరంగ సభ
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరుగనుంది. ఆలయాన్ని శిల్పులు సర్వాగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రారంభోత్సవానికి ముంగిట డిసెంబర్ 30న అయోధ్యలో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అయోధ్య విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను ప్రధాని ప్రారంభిస్తారు.


 
							 
							