దేశంలోకి అడుగుపెడితే…ఇక ఖతం
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో భయ్యా సన్నీ యాదవ్ దేశంలోకి ఎప్పుడు అడుగుపెట్టినా అరెస్టు చేస్తామని సూర్యాపేట పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ పలువురు యుట్యూబర్లు, సినీ తారలు బెట్టింగ్ యాప్స్పై ప్రచారం చేస్తున్న కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టారు.సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ గత కొన్నేళ్లుగా బైక్ రైడ్ చేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్గా గుర్తింపు పొందిన సన్నీ యాదవ్కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయగా, అతడు చెప్పినట్లుగా చేసి తాము ఆర్థికంగా నష్టపోయామని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
