Home Page SliderTelangana

ఎంపీ బెదిరిస్తే సైన్ బోర్డు మారుస్తారా?

తెలంగాణలో ఎంఐఎం గూండారాజ్యం పెరిగిపోతోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అంబర్ పేట ప్లై ఓవర్ సైన్ బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్అండ్ బీ అధికారులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఎంపీ బెదిరిస్తే సైన్ బోర్డు మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లను పట్టుకుంటున్నదని రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ను తిట్టారని గుర్తు చేశారు. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే జై మోడీ, జై యోగి అని కూడా అంటారని ఆయన పేర్కొన్నారు.