BRS, కాంగ్రెస్లు విన్ అయితే మిడ్ టెర్మ్ ఎన్నికలు తప్పవు
జన్నారం: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం. బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. అదే జరిగితే హరీష్రావు, సంతోష్ వేరు కుంపటి పెట్టి ప్రభుత్వాన్ని పడగొడతారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు చూస్తారు. అదే రూట్లో ఉత్తమ్కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారు. అందుకే బీజేపీని గెలిపించాలని ప్రార్థన. రాష్ట్ర అప్పులు తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని బండి కోరారు.

