Home Page SliderTelangana

నేను ఎన్నికలలో పోటీ చేయను..కోదండరాం

Share with

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో తాను పోటీ చేయడంలేదన్నారు తెలంగాణ జనసమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కోదండరామ్ పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ లక్షల కోట్లు అప్పుచేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు భారంగా మారిందన్నారు. కేసీఆర్ మాయమాటలకు పడిపోవద్దని, మేనిఫెస్టోలో ఏమీ లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని తెలిపారు. ప్రవళిక ఆత్మహత్యపై ప్రభుత్వం దిగజారుడు ప్రచారం మానుకోవాలన్నారు.