Home Page SliderNational

నేను మళ్లీ కర్ణాటక సీఎం అవుతాను..

కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతానని కుమారస్వామి పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్న అంతర్గత కలహాల కారణంగా ఈ ప్రభుత్వం పతనమవుతుందని జోస్యం చెప్పారు. ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని.. వారు తనకు మరో అవకాశం ఇస్తారని నమ్ముతున్నానని కుమారస్వామి అన్నారు. 2028లోపు వారి మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టి, మరింత అద్భుతంగా పని చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారని కుమారస్వామి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వ నేతల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతోంది. దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఈ విభేదాలు త్వరలోనే బయటకు పడతాయని, అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని కుమార స్వామి అన్నారు.