Breaking Newshome page sliderHome Page SliderNationalNewsviral

భర్త, ప్రియుడూ ఇద్దరూ కావాలి

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ యువతి నిర్ణయం గ్రామస్తులను, స్థానిక పంచాయతీ సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె ప్రతి నెలా 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 రోజులు తన ప్రేమికుడితో గడపడానికి అనుమతించాలని గ్రామ పంచాయతీ పెద్దలను డిమాండ్ చేయడమే దానికి కారణం. నైతిక విలువలకు త్రిలోదకాలు ఇచ్చేస్తూ అక్రమ సంబంధాన్ని నెరుపుతున్న స్త్రీలు, పురుషుల గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసిన కొంత మంది స్త్రీలు తమ ప్రేమికుడి కోసం కట్టుకున్న భర్తనే చంపేస్తున్నారు. అయితే తాజాగా ఒక మహిళ.. భర్త, ప్రియుడికి సమానంగా తన ప్రేమని పంచుతానని ప్రకటించి సంచలనం సృష్టించింది. యూపీలోని రాంపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సమాచారం ప్రకారం అజీమ్‌నగర్‌కు చెందిన ఒక యువతికి సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం పొరుగు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
వివాహం అయిన తర్వాత ఆ యువతి తాండా ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడి అతనితో పారిపోయింది. ఇలా భార్య పదిసార్లు తన ప్రేమికుడితో పారిపోయింది. ప్రతిసారీ భర్త ఆమెను ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు. అయితే ఆ మహిళ మళ్ళీ తన ప్రేమికుడితో పారిపోయేది. ఇటీవల ఆమె మళ్ళీ తన ప్రేమికుడి ఇంటికి వెళ్ళింది. ఆమె భర్త ఆమెను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె నిరాకరించడంతో కుటుంబ సభ్యులు పంచాయితీకి పిలుపునిచ్చారు.
విచారణ సమయంలో ఆమె అసాధారణ డిమాండ్ చేసి ఊరందరినీ ఆశ్చర్యపరిచింది.. ఇటువంటి ప్రతిపాదనను ఎలా అంగీకరిస్తామని గ్రామస్తులు ప్రశ్నించారు. ప్రతిస్పందనగా.. భర్త చేతులు జోడించి నమస్కరించి.. “నన్ను క్షమించు.. వెళ్లి నీ ప్రియుడితో ఉండు” అని అన్నాడు. అయితే ప్రస్తుతానికి పరిస్థితి ఇంకా పరిష్కారం కాలేదు. భర్త తనకు భార్యతో ఉండడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడు. అయితే.. ఆ మహిళ తనకు భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలని.. ఇద్దరికీ సమయం కేటాయిస్తానని చెప్పడంతో ఈ గొడవ వైరల్ గా మారింది.