Home Page SliderTelangana

రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్ష సూచన

అధికారులు అప్రమత్తంగా ఉండండి, విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకోండి
భద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యండి- – ఇ.ఎన్.సి అనిల్ కుమార్
రిజర్వాయర్లు, కాలువలు, నదులలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించండి
స్పిల్ వే లు,వరద గేట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా గమనించండి
అత్యాయక పరిస్థితులు అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించుకోండి
ఎప్పటికప్పుడు నీటి మట్టాలు, ప్రవాహం తీరు తెన్నుల సమాచారం సమగ్రంగా తెలుసుకోండి

రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ వాతావరణ శాఖ సూచనలతో తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖా అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖా ఇంజినీర్ జి.అనిల్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖాధికారులతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఫోన్ లలో సమీక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండి ఆయన ఇ.ఎన్.సి.,సి.ఇ, యస్.ఇ&ఇ.ఇ లతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటూనే భద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నారు. రిజర్వాయర్లు, కాలువలు, నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూనే స్పిల్ వే లు,వరద గేట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. అత్యయక పరిస్థితులు ఏర్పడితే ఎటువంటి నష్టం వాటిళ్లకుండా అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని అనిల్ కుమార్ ఆదేశించారు. అదే సమయంలో నీటి మట్టాలు, ప్రవాహం ఉధృతి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం తెలుసుకోవాలని ఆయన సూచించారు. అంతే గాకుండా అత్యాయక పరిస్థితుల సమాచారం అప్పటికప్పుడే కంట్రోల్ రూమ్ కు అందించాలని ఇ.ఎన్.సి అనిల్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.