Home Page SliderTelangana

కవిత ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్ళే దారులు అన్నీ పోలీసులు మూసివేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసారు. రేపు కవిత ఢిల్లీకి రావాలని ఈడీ నోటీసులిచ్చింది. 2023 మార్చి 7న రామచంద్ర పిళ్ళైను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. మార్చ్ 10 వ తేదీన ఢిల్లీ లోని ఈడీ ఆఫీస్‌కు విచారణను రావాలని కవితకు నోటీసులు జారీ అయ్యాయి. అరుణ్ రామచంద్ర పిళ్ళై… తాను కవిత బినామి అని ఒప్పుకునట్టు ఈడీ వెల్లడించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని BRS పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్ళే దారులున్నీ పోలీసులు మూసివేశారు. కవిత ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత నివాసంలోకి వచ్చేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. బారికేడ్లు ఏర్పాటు చేసి.. రాకపోకలను నియంత్రిస్తున్నారు.