హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ మహనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. కాగా ఇవాళ నార్కోటిక్ బ్యూరో అధికారులు నగరంలో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు.ఈ మేరకు ఎస్సార్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నార్కోటిక్ బ్యూరో ఈ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. కాగా కొందరు యువకులు బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 12మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వీరందరు ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. కాగా ఈ కేసులో పట్టుబడిన సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా నగరంలోని ప్రముఖ MNC కంపెనీల్లో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. అయితే పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు వెల్లడించారు.