Home Page SliderTelangana

తెలంగాణలో రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్

నేడు జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రమంత్రి వర్గం రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం జరిగింది. 2023 డిసెంబర్ 9 లోపు తీసుకున్న రుణాలకు ఈ రుణమాఫీ వర్తిస్తుందని, ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు కావలసిన నిధుల సమీకరణల గురించి ఈ సమావేశంలో చర్చించారు.