జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసు
మే 9వ తేదీ, సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ నిర్దేశించిన సమయంలో డ్యూటీలో చేరకపోతే, వారిని తొలగిస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమన్నారు.

ప్రభుత్వంతో జేపీఎస్లు చేసుకున్న అగ్రిమెంట్ బాండ్ను ఉల్లంఘిస్తూ యూనియన్గా ఏర్పడి, తమ సర్వీసు డిమాండ్తో 2023 ఏప్రిల్ 28 నుండి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సందీప్ సుల్తానీయా తెలిపారు. ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవాలు తెలిసినప్పటికీ, jps లు ఒక యూనియన్గా ఏర్పడ్డారని ప్రభుత్వం ఆరోపించింది. చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28, 2023 నుండి సమ్మెకు వెళ్ళరని ఆక్షేపించింది. నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జేపీఎస్లు ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారంది. అయితే, ప్రభుత్వం మానవతా దృక్పథంతో జేపీఎస్లకు చివరి అవకాశాన్ని ఇస్తోందంది. నిర్ణీత తేదీలోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ టర్మినేట్ అవుతారని హెచ్చరించింది.