మందుబాబులకు గుడ్న్యూస్
ఏపీ ప్రభుత్వం మందుబాబులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరు నాటికి రూ.99కే మద్యం సీసాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. ఈ నెలలో 2.4 లక్షల కేసులు మార్కెట్లోకి వస్తాయన్నారు. కొత్తగా లైసెన్సులు మంజూరు చేసినా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు కంపెనీలు ఏడు రకాల బ్రాండ్లను రూ.99కే అమ్మకానికి అంగీకరించారు.