80 వేల మార్క్ కు తాకనున్న గోల్డ్
బంగారం ధరలు రికార్డ్ గరిష్టాన్ని టచ్ చేశాయి. 10 గ్రాముల గోల్డ్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.79,900 కు చేరుకుంది. రూ.80 వేల మార్క్ కు కేవలం రూ. వంద దూరంలో ట్రేడవుతోంది. పండుగ సమయంలో డిమాండ్ పెరగడంతో పాటు మిడిల్ ఈస్ట్ టెన్షన్ల వలన గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. 10 గ్రాముల గోల్డ్ ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.550 పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. కేజీ వెండి ధర శుక్రవారం రూ.1,000 పెరిగి రూ.4,500 కి పెరిగింది. హైదరాబాద్ లో 10 గ్రాముల గోల్డ్ ధర శుక్రవారం రూ.870 పెరిగి రూ.78,980 కి చేరుకుంది.