Home Page SliderTelangana

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో  బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ..స్మగ్లింగ్‌ను కట్టడి చేయలేకపోతున్నారు. కొందరు కేటుగాళ్లు కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి కిలోల మేర బంగారాన్ని అక్రమంగా దేశాలకు తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా దాదాపు రూ.33 లక్షల విలువైన 533 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ బంగారాన్ని మొబైల్‌ఫోన్‌ కవర్లో దాచి  తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర నుంచి బంగారాన్ని పట్టుకున్న అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు.