గిల్ సెంచరీ.. కోహ్లీ హాఫ్ సెంచరీ..
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగి.. దూకుడుగా ఆడాడు. 12 ఫోర్లు, 1 సిక్స్తో 128 పరుగులతో అదరగొట్టాడు. ఛతేశ్వర్ పుజారా 42 పరుగులు చేసి ఫర్వాలేదనిపించుకున్నాడు. ఆసీస్ బౌలింగ్లో నాథన్ లైయన్, మాథ్యూ కునెమన్, టాడ్ మార్ఫీ తలో వికెట్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌటైంది.