గజ్వేల్: కుకునూరుపల్లి-బొబ్బాయిపల్లి ప్రచారంలో ఈటల రాజేందర్
గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం బొబ్బాయిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
రేషన్ కార్డు ఇవ్వడు.
డబుల్ బెడ్ రూం ఇవ్వడు.
పెన్షన్ కొత్తవారికి ఇవ్వడు.
అలాంటి కెసిఆర్కి ఎందుకు ఓటు వెయ్యాలి.
ప్రజలంతా ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ , టీడీపీ, తెరాసకి అధికారం ఇచ్చాం.. ఈసారి బిజెపికి ఇద్దాం అనుకుంటున్నారు. ఇవ్వమని మేము కోరుతున్నాం.
కెసిఆర్ రైతుల భూములు గుంజుకున్నారు. ఆ రైతులను అడ్డా మీద కూలీలుగా మార్చారు.
బిజెపికి ఓటు వేస్తే బీసీ వర్గాలకు అధికారం వస్తుంది. ఊర్లో 70 శాతం ప్రజలు బీసీ, ఎస్సీలు ఉన్నారు. మాజీ సర్పంచ్ మల్లేశం పార్టీలో చేరారు. BRS యూత్ అధ్యక్షులు పార్టీలో కృష్ణ చేరారు.