రేపు విశాఖలో జీ-20 సదస్సు.. గవర్నర్ను కలిసిన సీఎం
రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేశ విదేశీ అతిథులు హాజరుకానున్నారు. ఇప్పటికే చాలా మంది విశాఖ చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఈ సదస్సుకు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్కు తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్తో చర్చించినట్లు సమాచారం. జీ-20 సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు. జీ-20 సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం అతిథుల కోసం ఘనంగా విందు ఏర్పాటు చేయనుంది.