Andhra PradeshHome Page Slider

నేటి నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

దేవుడి దయతో నిజం గెలుస్తుంది అని న్నమ్ముతున్నా: భువనేశ్వరి

నా భర్త చంద్రబాబు నాయుడు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను అయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నాను.

వారానికి మూడు రోజుల పాటు భువనేశ్వరి యాత్ర సాగనుంది. చంద్రబాబు అరెస్ట్ వల్ల చనిపోయిన కుటుంబ సభ్యులకు టీడీపీ 3 లక్షల సాయం అందిస్తోంది. అంతే కాదు ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్న భరోసాను భువనేశ్వరి అందివ్వనున్నారు. మరోవైపు చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లడంపై భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు.