Home Page SliderNational

రాహుల్‌తో కలిసి నడచిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఉదయం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈరోజు రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నుండి కాంగ్రెస్ పాదయాత్ర పునఃప్రారంభమైనప్పుడు ఆయన యాత్రలో కన్పించారు. రాజన్, గాంధీ చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్‌లో ముగియనున్న భారత్ జోడో యాత్రలో వివిధ రంగాలకు చెందిన పలువురు పాల్గొంటున్నారు. గత కొన్ని నెలలుగా గాంధీ యాత్రలో పాల్గొన్న వారిలో ఉద్యమకారిణి మేధా పాట్కర్, నామ్‌దేవ్ దాస్ త్యాగి, నటి స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ ఉన్నారు.