Breaking NewsHome Page SliderTelangana

విదేశీ గంజాయి …అమెరికా 2 హైద్రాబాద్‌

హైదరాబాద్‌లో విదేశీ గంజాయి కలకలం రేగింది. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా అమ్మకాలు జరుపుతున్న ముఠా గుట్టును ఆదివారం అర్ధరాత్రి పోలీసులు చేధించారు. గచ్చిబౌలిలో ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వ‌హిస్తుండగా ఈ ముఠా భాగోతం ర‌ట్టైంది. ప్రశాంతి హిల్స్‌ టింబర్‌ లేక్‌​ వ్యాలీ వద్ద ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న శివరామ్‌గా గుర్తించారు పోలీసులు. పరారైన వ్యక్తి పేరు అజయ్‌గా తెలుస్తోంది.ఈ వ్య‌వ‌హారంలో ఎంత‌టి వారున్నా ఉపేక్షించేది లేద‌ని సీపి తెలిపారు.అస‌లు అమెరికా నుంచి హైద్రాబాద్ కి గంజాయిని ఏ విధంగా స‌ర‌ఫరా చేస్తున్నారో,ఎక్క‌డెక్క‌డికి త‌ర‌లిస్తున్నారో,వీరి వెనుక ఎంత మంది పెద్ద వాళ్లున్నారో అనేది ఆరా తీస్తున్నారు. ప‌రారీలో ఉన్న అజ‌య్ కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్ప‌డి గాలిస్తున్నారు.