Home Page SliderNational

హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు

ప్రజల డిమాండ్ కు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు.. హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ – కాన్పూర్ మధ్యన, హైదరాబాద్ నుంచి అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసును, రేపటినుంచి (సెప్టెంబర్ 28) హైదరాబాద్ – ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్ – ఆగ్రా మధ్యన వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరం నుంచి ఇలా ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసుల ప్రారంభం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్ ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి ప్రయాణికులను కోరారు.