Home Page SliderNational

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు డాక్టర్లు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు సైఫాయి మెడికల్ కాలేజీకి చెందినవారని, లక్నో నుంచి సైఫాయికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయవీర్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.