న్యాయవాదిపై ఫైరింగ్ ..
ఓ వ్యక్తిని పట్టపగలు నడిరోడ్డుపై దండగులు వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోరాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, నిర్భయ నేరస్థులు న్యాయవాది మాన్ సింగ్ యాదవ్ను బహిరంగంగా కాల్చి చంపారు. ఆ న్యాయవాది సోరాన్ తహసీల్లో పనిచేస్తున్నాడు. తీవ్రంగా గాయపడిన న్యాయవాదిని చికిత్స కోసం నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత, ఆ ప్రాంతంలో సంచలనం వ్యాపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం ప్రయాగ్రాజ్ పోలీస్ కమిషనరేట్లోని గంగానగర్ జోన్లో జరిగింది.