డీఎస్సీలో సత్తా చాటిన తండ్రీ కొడుకులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో తండ్రి కొడుకులకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ర్యాంకులు వచ్చా యి. నారాయణ పేట జిల్లా మరికల్ మండలం రాకొండకు చెందిన తండ్రి గోపాల్ తెలుగు పండిట్ జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించగా, కొడుకు భాను ప్రకాశ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ 9వ ర్యాంక్ సాధించారు. అయితే.. గోపాల్ ఇంట్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. గోపాల్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు జడ్చర్లలో స్థిరపడ్డారు. భార్య విజయలక్ష్మి ఇది వరకే తెలుగు పండిట్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. రెండు నెలల కింద వారి రెండో కొడుకు చంద్రకాంత్ ఏఈఈ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మొదటి కొడుకు భానుప్రకాశ్ ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లో 9వ ర్యాంకు సాధించాడు. తండ్రి కొడుకులు డీఎస్సీలో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం పట్ల గ్రామస్తులు వీరిని అభినందిస్తున్నారు.

