accidentAndhra PradeshHome Page SliderNews Alert

ఘోర ప్రమాదం..రెండు బస్సులు ఢీ

ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి వద్ద రాయల్పాడులో రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. దీంతో బస్సులు ముందు భాగం నుజ్జునుజ్జుగా మారింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా, 40 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. 25 మంది డిశ్చార్జ్ అయ్యారని సమాచారం.