ఘోర ప్రమాదం.. 71 మంది మృతి..
ఇథియోపియాలోని సిదామా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరై వస్తుండగా నదిలో ట్రక్కు పడింది. ఈ ఘటనలో 71 మంది చనిపోయారు. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

