Home Page SliderTelangana

“ప్రభుత్వానికి కళ్లు,చెవులు కలెక్టర్లే”: సీఎం రేవంత్ రెడ్డి

ఈ రోజు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. కాగా ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ కలెక్లర్లకు కీలక సూచనలు చేశారు.తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామన్నారు.ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లేనని సీఎం పేర్కొన్నారు. కాగా కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారన్నారు.తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారన్నారు.తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సీఎం కలెక్టర్లకు పిలుపునిచ్చారు.ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలన్నారు.ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలన్నారు.సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు.ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోందన్నారు.తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం అన్నారు.విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలన్నారు.కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారని సీఎం గుర్తుచేశారు.కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలన్నారు.ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందన్నారు.ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.