Home Page SliderTelangana

హైకోర్టు ఆర్డర్ అమలు చేయించండి.. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల జరిపించండి

అన్యాయంగా, అక్రమంగా జరిగిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈరోజు పి.ఉదయ్ కుమార్, ఐఏఎస్, కమిషనర్ కోపరేషన్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్‌ను జర్నలిస్ట్ సంఘాల నాయకులు కలిశారు. జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ కు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వెంటనే ఎన్నికలు జరపాలని కోరుతూ జెసిహెచ్ఎస్ఎల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో కో ఆపరేటివ్ కమీషనర్ మరియు రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సోసైటీస్ పి.ఉదయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు జరపకపోవడంతో సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా నాన్ అలాటీ సభ్యులు తీవ్రంగా నష్టపోయారని విన్నవించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సోసైటీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు. 4 నెలల లోపు ఎన్నికలు పూర్తి చేయాలని కోరగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిత్యం అనేక ఇబ్బందులు పడుతూ జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జెసిహెచ్ఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాండభేరి గోపరాజు, మహేష్, గయాస్ పాషా, రఘు, పి. సాగర్, సునీత, పర్వీన్, మీసా శ్రీనివాస్, రామకృష్ణ, కే. రాజు, విఘ్నేశ్వర్ రావు తదితర జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.