పవన విద్యుత్ పంకా నుంచి జారిన ఉద్యోగి
అనంతపురం జిల్లా ఉరవకొండలోని నింబగల్లు వద్ద పవన విద్యుత్ పంకా నుంచి ప్రమాదవశాత్తు జారిన సుందరేశ్ అనే ఉద్యోగి. రోప్ వే(తాడు)లో ఇరుక్కుపోయి, మధ్యలోనే ప్రమాదకరంగా వేలాడుతూ ఉండిపోయాడు. తోటి సిబ్బంది, స్థానికులు, అగ్నిమాపక అధికారులు సమన్వయంతో కాపాడారు. తాడులో ఇరుక్కున్న అతడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు.