Home Page SliderTelangana

రౌడీషీటర్ కు ఈడీ షాక్.. ఆస్తులు సీజ్

తొలిసారిగా ఒక రౌడీ షీటర్ కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఎటువంటి ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ కేవలం నేర కార్యకలాపాలు, బెదిరింపులతో వచ్చిన డబ్బులతో సమకూర్చుకున్న ఆస్తులుగా ఈడీ గుర్తించి సీజ్ చేసింది. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ రికార్డుల్లో రౌడీ షీటర్ నమోదైన మహ్మద్ కైసర్ పై రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, జూదం, భూ కబ్జాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. అతను పీడీ యాక్ట్ కింద అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతను నేర కార్యకలాపాలతో సంపాదించిన డబ్బుతో భార్య షాహెదా బేగం పేరు మీద 2007 నుండి 2020 మధ్య పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. వీటి విలువ అధికారికంగానే రూ.1.01 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.