సీఎం సతీమణికి ఈడీ నోటీసులు
మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణా టక మంత్రి బైరాతి సురేశ్ లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆమె సోదారుడు బీఎం మల్లికార్జునస్వామి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఇదివరకే సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది. తాజాగా ఈడీ జారీ చేసిన నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.