Home Page SliderNewsTelanganaTrending Today

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం, సీజ్‌.. నలుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌లోని హుమాయున్‌ నగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్‌ న్యూ అధికారులు దాడులు చేశారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో మరోసారి పెద్దయెత్తున డ్రగ్స్‌  పట్టుబడ్డాయి. వారివద్ద 50 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఓ విదేశీయుడితో పాటు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు బాచుపల్లి పీఎస్‌ పరిధిలోని టకీలా పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. అనుమతులు లేకుండా పబ్‌లో కార్పొరేట్‌ ఈవెంట్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పబ్‌లో మ్యూజిక్‌ పరికరాలు, రెండు ల్యాప్‌టాప్‌లను సీజ్‌ చేశారు. పబ్‌ యజమానులపై కేసు నమోదు, దర్యాప్తు..