Home Page SliderNational

నేటితో ‘ధూమ్’కి 20 ఏళ్లు…

‘ధూమ్’ మూవీకి 20 ఏళ్లు నిండినందున, మేము ఆ సినిమా నటుడు జాన్ అబ్రహంతో, అతని పాత్ర కబీర్ గురించి షేర్ చేసుకున్న ఈ వృత్తాంతాన్ని ఒకసారి గుర్తుచేసుకున్నాం. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం, ఇందులో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, బిపాసా బసు, ఈషా డియోల్ కూడా నటించారు. నటుడు జాన్ అబ్రహం ‘ధూమ్’ షూటింగ్‌ని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి ఆగస్టు 27వ తేదీతో 20 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఇందులో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ఉదయ్ చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ సినిమా ధూమ్ – నటీనటుల కెరీర్‌లో ఒక మైలురాయిగా చెప్పుకోవాలి, ఈ సినిమా తీసే టైమ్‌లో వారు చాలా క్రూసియల్ పీరియడ్‌లో ఉండగా, ఒక మంచి హిట్‌ని అందించింది. వారి జీవితాలను మలుపు తిప్పిన సినిమా. నిర్మాత ఆదిత్య చోప్రా విలన్‌గా నటించడానికి తనను ఎలా సెలెక్ట్ చేశారో జాన్ అబ్రహాం ఇంతకు ముందు గుర్తు చేసుకున్నాడు.

తన పోడ్‌కాస్ట్‌లో యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాతో మాట్లాడుతూ, నటుడు ఇలా షేర్ చేశాడు, “ఆదిత్య చోప్రా ఈ పాత్రను కూల్‌గా, ప్రశాంతంగా, కంపోజ్డ్‌గా తీసుకున్నాడు. విలన్ లాంటి వ్యక్తి, కానీ, చాలా కూల్‌ ఐన వ్యక్తి. అతను ఎప్పుడూ అలానే నాకు చెప్పేవాడు, ‘వినండి , చెడుగా ప్రవర్తించేలా యాక్టింగ్ చేయగలిగిన ఏకైక వ్యక్తి మీరు మాత్రమే, కాబట్టి, మీరు చల్లగా ఉండాలి.’ పఠాన్‌లో కూడా నా పాత్ర అలాంటిదే మీకు తెలుసు. అదే ఇంటర్వ్యూలో, జాన్ తాను యాక్టింగ్ చేసిన కబీర్ పాత్ర, భవిష్యత్తులో ఫ్రాంచైజీగా తిరిగి వస్తా అని సమాధానం చెప్పాడు. అతను తిరిగి వస్తాడని నేను కూడా అనుకున్నాను, బహుశా ఆదిత్య (చోప్రా) గురించి తన మనసు మార్చుకుంటే, బహుశా నేను కూడా తిరిగి రావచ్చు. ఇది చాలా భిన్నమైన సినిమా, మోటర్‌బైక్‌లుపై స్టంట్స్ ఉంటాయి, కాబట్టి, ఈ చిత్రానికి ధూమ్ అని పేరు పెట్టారు. దాంతో నాకు కొన్ని గొప్ప జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి, ఆ తర్వాత నా కెరీర్‌లో మార్పు వచ్చింది” అని జాన్‌ తెలిపారు. జాన్ అబ్రహంతో పాటు, ధూమ్‌లో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, ఈషా డియోల్, బిపాసా బసు కూడా నటించారు. ఇది కమర్షియల్‌గా మంచి హిట్ కొట్టింది.