Home Page SliderTelangana

టాలీవుడ్‌లో పరువునష్టం కేసు –జీవిత,రాజశేఖర్‌లకు జైలుశిక్ష

చిరంజీవి బ్లడ్‌బ్యాంకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో టాలీవుడ్‌లో సినీనటులు జీవిత,రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఏడాది జైలుశిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధించింది. వీరు 2011లో చిరంజీవి బ్లడ్‌బ్యాంకు సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై ఆరోపణలు చేశారు. ఈ బ్లడ్‌బ్యాంకులో సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారంటూ అసత్య ఆరోపణలు చేశారని సినీనిర్మాత అల్లు అరవింద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఈ తీర్పు నిచ్చింది. జరిమానా చెల్లించి, అనంతరం అప్పీలుకు వెళ్లవచ్చని అవకాశమిస్తూ వీరికి బెయిల్ కూడా మంజూరు చేసింది.