వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ప్రమాదంలో తండ్రి, కూతురు గల్లంతయ్యారు. కొడుకు మృతి చెందాడు. తల్లిని గ్రామస్తులు కాపాడారు. వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో వారి కారు ప్రమాదవశాత్తు పడిపోయింది. ప్రవీణ్ భార్య కృష్ణవేణిని గ్రామస్తులు కాపాడగా కొడుకు అప్పటికే మృతి చెందాడు, కాలువలో గల్లంతైన తండ్రి, కూతురు కోసం స్థానికులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.