కరెంట్ చార్జీలు పెంచడం లేదు..
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచడం లేదని, సామాన్యులపై భారం వేయడం లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని విద్యుత్ నియంత్రణ భవన్ లో మాట్లాడుతూ.. HT 11 KV వినియోగదారులపై కూడా చార్జీల భారం పడదని వెల్లడించారు. అలాగే EV చార్జింగ్ స్టేషన్లకు ఫిక్స్ డ్ చార్జీలు ఉండబోవని, వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కేవలం 300 యూనిట్లు పైబడిన వారికి మాత్రమే ఫిక్సెడ్ చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు. శాఖ పరిధిలో ఫ్యూస్, ఇతర సామాగ్రి మిస్సింగ్ అవుతున్నాయని, అలా జరగకుండా ఉండేందుకు దానికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నామన్నారు.

