Home Page SliderTelangana

చుక్కా రామయ్య నివాసానికి సీఎస్ శాంతి కుమారి

ఈ రోజు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పుట్టిన రోజు. జన్మదిన విషెస్ చెప్పడానికి చుక్కా రామయ్య నివాసానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెళ్లారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చేత సీఎస్ కేక్ కట్ చేయించారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చుక్కారామయ్య నివాసానికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పారు. గత కొంత కాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత మే లో సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిశారు.