Home Page SliderTelangana

బీజేపీకి జై కొడితేనే.. పద్మ అవార్డులు

పద్మ అవార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి జై కొడితేనే.. పద్మ అవార్డులు ఇస్తారా? చామల ప్రశ్నించారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి బండి సంజయ్ మాటలు హాస్యాస్పదమన్నారు. ఆయన ఒక కేబినెట్ మినిస్టర్ అని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైట్ వింగ్, బీజేపీ భావజాలం ఉన్న వాళ్లకే పద్మ అవార్డులు ఇస్తామనే విధంగా మాట్లాడుతున్నారని, అయితే బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ గొంతు పలికిన వారికే అవార్డులు ఇస్తారా? అని నిలదీశారు. ఈ మేరకు ఇవాళ ఎంపీ చామల ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతూనే ఉందని ఆరోపించారు. పద్మ అవార్డుల విషయంలో ప్రభుత్వ సిఫార్సులను విస్మరించి.. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.