Home Page SliderTelangana

పుష్ప బెనిఫిట్ షోపై ఎన్ హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు

పుష్ప – 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు న్యాయవాది రవికుమార్ ఫిర్యాదు చేశారు. పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. ‘సంధ్య థియేటర్ యాజమాన్యం భద్రతా ఏర్పాట్లు పాటించకపోవడంతో పాటు రద్దీని కంట్రోల్ చేయలేకపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలి. హీరో అల్లు అర్జున్ తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని రవికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. న్యాయవాది ఫిర్యాదును ఎన్ హెచ్ ఆర్ సీ విచారణకు స్వీకరించింది.