భారత అంధుల క్రికెట్ జట్టుతో సీఎం
జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూయార్క్ నగరంలో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను కలుసుకున్నారు. వారిని కలుసుకునే భాగ్యం తనకు లభించిన ఒక అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు. జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుండి నేర్చుకోగలమన్నారు. వారిలోని స్పూర్తిని అభినందిస్తూ వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

