నడి రోడ్డుపై కూర్చుని సీఎం ధర్నా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నడి రోడ్డుపై బైఠాయించి రాజ్ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అదానీ విషయంపై పార్లమెంట్ లో చర్చకు కేంద్రం అంగీకరించకపోవటం.. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. అసెంబ్లీ నుంచి గవర్నర్ రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ చేసుకున్న తర్వాత.. రాజ్ భవన్ ఎదుటనే సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ నడి రోడ్డుపై బైఠాయించారు. జై కాంగ్రెస్.. జై సోనియాగాంధీ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా డౌన్ డౌన్ మోదీ అంటూ నినదించారు. మణిపూర్ అంశంపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నేతలు ప్రశ్నించారు.