Home Page SliderTelangana

గుజరాత్ వెళ్లనున్న సీఎం రేవంత్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళనున్నారు. అహ్మదాబాద్ లో రేపు, ఎల్లుండి ఏఐసీసీ కీలక సమావేశాలు జరగ నున్నాయి. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు రేపు ఆయన అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు కీలక నేతలు ఇవాళ సాయంత్రమే బయలుదేరనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందింది. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశాల్లోనే కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ వివరించనున్నారు.