మహబూబ్నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం మహబూబ్నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.కాగా సీఎం మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.కాగా సీఎం పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు.మహబూబ్నగర్ రూరల్,గండీడ్లో రూ.3.25 కోట్లు,రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులు,రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.