రేపే సీఎం రేవంత్ పాదయాత్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 8.45 గంటలకు సీఎం రేవంత్ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు వైటీడీఏ అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకొని మూసీ పరీవాహక ప్రాంత రైతులతో కలిసి పాదయాత్రగా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శిస్తారు. పలువురు రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న తరువాత హైదరాబాద్ పయనమవుతారు.

