అరుణాచల్లో జరిగిన G20 మీట్కు చైనా డుమ్మా
ఆదివారం భారత్లో జరిగిన జీ20 కీలక సమావేశానికి చైనా గైర్హాజరయ్యింది. అరుణాచల్ టిబెట్లో భాగమని చెబుతున్న చైనా, రాజధాని నగరం ఇటానగర్లో సమావేశానికి డుమ్మా కొట్టింది. చైనా చాన్నాళ్లుగా చెబుతున్న వాదనను ఇండియా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. అరుణాచల్ ఇండియాలో అంతర్భాగంగా స్పష్టం చేస్తోంది. సెప్టెంబరులో ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు 50 ప్రధాన నగరాల్లో డజన్ల కొద్దీ కార్యక్రమాలను ప్లాన్ చేసిన ఈ సమావేశానికి 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. G20 అధ్యక్ష పదవిని ఇండియా నిర్వహిస్తోంది.
ఈ సమావేశంపై చైనా అధికారికంగా భారత్కు నిరసన తెలియజేసిందా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ, చైనా కానీ స్పందించలేదు. వారాంతపు సమావేశంపై ప్రచారం జరగలేదు. మీడియా కవరేజీకి అనుమతి లేదు. ‘పరిశోధన ఆవిష్కరణ చొరవ, సేకరణ’ అనే థీమ్తో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశానికి హాజరైన ప్రతినిధులు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ, ఇటానగర్లోని బౌద్ధ విహారాన్ని కూడా సందర్శించారు. అక్కడికి చేరుకున్న వారికి విమానాశ్రయంలో సాంస్కృతిక బృందాలు ఘనస్వాగతం పలికాయి. వారు స్థానిక వంటకాలను కూడా రుచి చూశారు.
అరుణాచల్లో G20 మీట్కు హాజరయ్యే విషయాన్ని చైనా దాటవేసిందని విదేశీ వ్యవహారాల వర్గాలు తెలిపాయి. సెప్టెంబరులో ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు 50 ప్రధాన నగరాల్లో డజన్ల కొద్దీ కార్యక్రమాలను ప్లాన్ చేసిన ఈ సమావేశానికి 50 మంది ప్రతినిధులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్లో నెలల తరబడి సరిహద్దు ప్రతిష్టంభనతో ఇరుదేశాల మధ్య అగ్గిరాజుకొంది. గత డిసెంబర్లో అరుణాచల్ తవాంగ్ సెక్టార్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంట ఇండియా, చైనా చైనా దళాలు ఘర్షణ పడ్డాయి. LACతో పాటు యథాతథ స్థితిని “ఏకపక్షంగా” మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాడు ఆరోపించారు.