Home Page SliderNational

సీఎస్‌కే టీంను అభినందించిన సీఎం జగన్‌

ఈ ఏడాది IPL సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టి IPL ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో CSK టీమ్ 5 వసారి IPL ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా CSK టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, క్రికెటర్‌ అంబటి రాయుడు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిశార. ఈ సందర్భంగా ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు అంబటి రాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా అంబటి రాయుడు సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఇటీవల ఐపీఎల్‌ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్ ట్రోఫీని సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్,అంబటి రాయుడు సీఎం జగన్‌కు చూపించారు. అనంతరం సీఎస్‌కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించారు. దీంతో సీఎం జగన్ CSK టీమ్‌కు అభినందనలు తెలిపారు.