పట్టాలు తప్పిన UPలో చంఢీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్
ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఈరోజు చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు కనీసం 10 కోచ్లు పట్టాలు తప్పాయి. ఉత్తరప్రదేశ్లోని గోండా, జిలాహి మధ్య ఉన్న పికౌరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక చర్యల కోసం రెస్క్యూ టీమ్ను ఘటనాస్థలికి పంపారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఒకరు చనిపోయినట్టు సమాచారం. 12 కోచ్లలో, ఏసీ కంపార్ట్మెంట్లోని నాలుగు కోచ్లు జులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల ముందు పట్టాలు తప్పాయి. ప్రమాద స్థలం నుండి వీడియోలు పట్టాలు తప్పిన కోచ్ల నుండి ప్రజలు తమ లగేజీని బయటకు తీస్తున్నట్లు కన్పించింది. కోచ్లలో ఒకటి పల్టీలు కొట్టి దాని ఎడమ వైపునకు ఒరిగింది. వాటిపై ప్రయాణికులు దానిపై నిలబడి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకోవాలని అధికారులను కోరారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, కొంతమందికి గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.


