అక్షర్ పటేల్కు కెప్టెన్సీ
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ..ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. 2019లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్ల్లో ఆడిన అక్షర్, మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్కు మారిన రిషబ్ పంత్ నుండి బాధ్యతలు స్వీకరించాడు.T20 కెప్టెన్సీ అనుభవం విషయానికొస్తే, అక్షర్ గుజరాత్కు 16 మ్యాచ్లలో నాయకత్వం వహించాడు.అదే అక్షర్ పటేల్ని ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా నాయకత్వ బాధ్యతలు లభించేలా చేసింది. రూ.16.5కోట్లకు అక్షర్ని దక్కించుకున్న ఢిల్లీ ఫ్రాంఛైజర్స్ నిన్న సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.