ఏపీలో ప్రారంభమైన కేబినెట్ సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అమరావతి,పోలవరం నిర్మాణంతోపాటు సూపర్ సిక్స్ హామీలు,ఐదు సంతకాలపై మంత్రి వర్గం ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీలో పెన్షన్ల్ పెంపు,మెగా డీఎస్సీ,అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ,స్కిల్ సెన్సస్కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.